YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పెద్దపల్లి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక భూ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు!!

Highlights

  • పెద్దపల్లి మండలం కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం గ్రామాల్లో నెలకొన్న ప్రత్యేక భూ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి.
  • కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం గ్రామాలకు చెందిన 462 ఎకరాల భూమి విషయంలో నెలకొన్న వివాదాo
  • వెంటనే సమస్య పరిష్కరించాలని, కాస్తులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలని ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక భూ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు!!

పెద్దపల్లి మండలం కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం గ్రామాల్లో నెలకొన్న ప్రత్యేక భూ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలం పరిధిలోని కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం గ్రామాలకు చెందిన 462 ఎకరాల భూమి విషయంలో నెలకొన్న వివాదాన్ని ఎమ్మెల్యే శ్రీ మనోహర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ భూమిలో గ్రామాలు వెలిశాయని, రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, రోడ్లు, స్కూళ్లు తదితర నిర్మాణాలు కూడా జరిగాయని ఎమ్మెల్యే చెప్పారు. అయితే 1950కు ముందు ఈ భూములన్నీ దేవాదాయ శాఖ పరిధిలోని భూములుగా అధికారిక రికార్డుల్లో నమోదై ఉంది. ఇటీవల జరిగిన భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటించిన అధికారులు కూడా ఎవరు హక్కు దారులనేది తేల్చలేకపోయారు. కాస్తులో ఆయా గ్రామాలకు చెందిన రైతులున్నారు. ఇండ్లు, స్కూళ్లు, ఇతర నిర్మాణాలున్నాయి. కానీ రికార్డుల్లో మాత్రం దేవుడి మాన్యాలుగా నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ వివాదాన్ని అప్పటికప్పుడు పరిష్కరించలేకపోయారు. పార్టు-బి కింద చేపట్టడం కోసం పెండింగ్ లో పెట్టారు. దీంతో ఈ గ్రామాల రైతులకు యాజమాన్య హక్కులు రావడం లేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎంకు వివరించారు. దశాబ్దాలుగా రైతులు ఈ భూములు సాగు చేసకుంటున్నారని, కాస్తులో వారే ఉన్నారని, యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని, కాస్తులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలని ఆదేశించారు.

Related Posts