YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పరారీలో ఇన్సెపెక్టర్ బల్వంతయ్య

పరారీలో ఇన్సెపెక్టర్ బల్వంతయ్య

పరారీలో ఇన్సెపెక్టర్ బల్వంతయ్య
హైదరాబాద్ జనవరి 10,
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య పరారీలో వున్నారు. అయన ఆచూకీ కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. బలవంతయ్య సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాట్లు అధికారులు గుర్తించారు. బల్వంతయ్య కుటుంబ సభ్యులను, బంధువుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. గురువారం నాడు జూబ్లీహిల్స్ సుధీర్ రెడ్డి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఎస్సై సుధీర్ రెడ్డిని విచారించగా సిఐ బల్వంతయ్య ఆదేశాల మేరకే డబ్బులు తీసుకున్నట్టు తెలిపాడు. దాంతో వారిద్దరి మీదా ఏసీబీ కేసులు నమోదు చేసింది. మరోవైపు, గురువారం లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య, ఎస్ఐ సుధీర్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పోలీసులు లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.

Related Posts