YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మహేశ్ ఇంటి ముందు ధర్నా చేసిన ముగ్గురు అరెస్ట్

మహేశ్ ఇంటి ముందు ధర్నా చేసిన ముగ్గురు అరెస్ట్

మహేశ్ ఇంటి ముందు ధర్నా చేసిన ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ జనవరి10 
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు చేస్తున్న ఆందోళనకు సినీ నటీనటులు మద్దతివ్వాలని జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఇవాళ ముగ్గురు వ్యక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు.  ఇవాళ్టి నుంచి 19 వరకూ..!   ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ వారు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి అధ్యక్షుడు షేక్ జిలాని మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు అమరావతి వైజాగ్లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.  మొత్తం 5 డిమాండ్లపై..ఏపీకి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని.. అదే విధంగా ఏపీ పునర్విభజన చట్టంలోని విభజన హామీలు అమలు చేయాలని జిలానీ చెప్పుకొచ్చారు. మొత్తం 5 డిమాండ్లపై పోరాటంకు సిద్ధమవుతున్నట్లు జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి ప్రకటించింది. కాగా.. ప్రస్తుతానికి మహేష్ బాబు ఇంటి దగ్గర ఎలాంటి ఉద్రిక్తతా లేదు.. అంతా ప్రశాంతంగానే ఉంది. అయితే ఈ వ్యవహారంపై మహేశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Related Posts