YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బోనులో నిలబడ్డ తొని సీఎం జగన్

బోనులో నిలబడ్డ తొని సీఎం జగన్

బోనులో నిలబడ్డ తొని సీఎం జగన్
విజయవాడ జనవరి 10 

కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రి జగనేనని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు.   ఇలాంటి నేరప్రవృత్తి ఉన్న వ్యక్తి సీఎం కావడం వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.  సీఎంతో పాటు వైకాపా నేతలు, అధికారులు జైళ్లకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రం ఆందోళనలతో మండిపోతుంటే వీడియో గేమ్ లతో సీఎం, కోడి పందేలతో మంత్రులు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.క్రిస్మస్, సంక్రాంతి కానుకలు ఎగ్గొట్టడం ద్వారా కోటి మందికిపైగా పేదల కడుపు కొడుతున్నారని ఆక్షేపించారు. అమరావతి ప్రాంత మహిళలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండించారు.  ప్రభుత్వం మానవ హక్కులను యథేచ్ఛగా కాలరాస్తోందన్న ఆయన... ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

Related Posts