YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భైంసాలో రెండు వర్గాల మధ్య గొడవ.. ఉత్తర తెలంగాణలో నెట్ కట్   

భైంసాలో రెండు వర్గాల మధ్య గొడవ.. ఉత్తర తెలంగాణలో నెట్ కట్   

భైంసాలో రెండు వర్గాల మధ్య గొడవ.. ఉత్తర తెలంగాణలో నెట్ కట్
         బిజెపి ఏంఎల్ఏ రాజాసింగ్ హౌస్ అరెస్ట్ 
హైదరాబాద్ జనవరి 14 
:భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఓ చిన్న గొడవ.. తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ లు ఉత్తర తెలంగాణలో నాలుగు జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ను నిషేధించారు. అలాగే అక్కడ సుమారు రెండు బెటాలియన్ల మేర రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరింపజేశారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోలీసులు నిఘా ఉంచారుఈ ఆందోళన వల్ల ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమౌతాయనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు.భైంసాలో 144 సెక్షన్ విధించారు.బిజెపి ఏంఎల్ఏ రాజాసింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు.. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ ఆపేశారు. ఒక వర్గం వారి నివాసాలపై మరొక వర్గం వారు దాడులు చేశారు. ప్రతిదాడులకు దిగారు. ఈ ఘటన అనంతరం పోలీసులు భైంసాలో 144 సెక్షన్‌ను విధించారు. ఫలితంగా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిర్మల్ జిల్లాలోని భైంసా వెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో భైంసా ఆందోళనను భగ్నం చేశారు. సోమవారం రాత్రి భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లు, రెండు వర్గాల మధ్య సంభవించిన దాడులు, ప్రతిదాడులకు నిరసనగా ఆయన ఛలో భైంసాకు పిలుపునిచ్చారు.

Related Posts