YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ గెలిస్తే వచ్చేది ఇదేనని  2014లోనే హెచ్చరించా

వైసీపీ గెలిస్తే వచ్చేది ఇదేనని  2014లోనే హెచ్చరించా

వైసీపీ గెలిస్తే వచ్చేది ఇదేనని  2014లోనే హెచ్చరించా
నేను 2014లోనే చెప్పాను ‘‘వైసీపీని గెలిపిస్తే రాష్ట్రంలో పాలెగాళ్ల ఫ్యాక్షనిజం పాలన వస్తుందని . రాష్ట్రంలో ప్రశాంతతకు మారుపేరైన కాకినాడలో ఇప్పుడు ఆ ఛాయలు బయటపడ్డాయి. సహనం జనసేన బలం. చేతగానితనం అనుకోవద్దు. మేం తెగిస్తే మీరు ఎవరూ ఉండలేరు. అధికారం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదు. అరికాలు నుంచి నెత్తి వరకూ మదమెక్కితే బూతులు వస్తాయి.వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తుంటే
చోద్యం చూసిన పోలీసులు దెబ్బలు తిన్న మాపైనే సెక్షన్‌ 307 కింద కేసులా! అటువంటి వారిని ప్రజలు రాజకీయాల నుంచి వెలివేయాలి’’’ అని జనసేనాని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. వారిని పరామర్శించడానికి పవన్‌ మంగళవారం కాకినాడ వచ్చారు. స్థానిక నాయకుడు పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న బాధితులను పరామర్శించారు.

Related Posts