YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు సినిమా

రష్మికకు షాకిచ్చిన ఐటీ

రష్మికకు షాకిచ్చిన ఐటీ

రష్మికకు షాకిచ్చిన ఐటీ

దక్షిణాది సినీ పరిశ్రమంలో ఓ వెలుగు వెలుగుతున్న ప్రముఖ అగ్ర కథానాయిక రష్మిక.కన్నడ అందాల భామ రష్మిక తెలుగు పరిశ్రమలో కూడా ప్రత్యేకతను చాటుకుంది.ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలై విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలో ఐటీ శాఖ అధికారులు రష్మికపై సోదాలు జరగడం తెలుగు సనీపరిశ్రమకు చెందిన వర్గాలు చర్చించుకుంటున్నారు.టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ హీరోయిన్ రష్మిక మందనా ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే అనుకోని షాక్ ఎదురైందనే భావన ప్రస్తుతం వ్యక్తమవుతోంది.
రష్మిక ఆస్తులపై ఐటి శాఖ అధికారులు ఆరా తీస్తున్న సమయంలో రష్మిక ఓ సినిమా షూటింగ్ లో ఉన్నారు.రష్మిక బ్యాంక్ ఖాతాలతో పాటు ఆమె తండ్రికి సంబంధించిన స్థిర, చరాస్తి వివరాల్ని ఐటీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సోదాల్లో రష్మిక బ్యాంకుఖాతాలతో పాటు విలువైన డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా తెలుగు చిత్రాల ద్వారా పారితోషికాన్ని చాలా తక్కువగా చూపించడం ఇక్కడ ఆశక్తికరంగా మారింది.కిర్క్ పార్టీ సినిమాకి 5 లక్షలు చెల్లించారు.చమక్ మూర్తి 8 లక్షలు , అంజని పుత్రా 7 లక్షలు,మాస్టర్ 18 లక్షలు,పోగారు చిత్రానికి 50 లక్షలు , తెలుగు చలో 25 , గీత గోవింద్ 40 లక్షలు రష్మీకి చెల్లించారు.రష్మిక ప్రస్తుతం నితిన్ నటిస్తున్న భీష్మతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ల చిత్రాల్లో నటిస్తోంది.ఈ సోదాల్లో ఇంకేలాంటి విషయాలు బయట పడతాయో చూడాల్సిందే ..

Related Posts