YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జగన్‌ వ్యక్తిగత హాజరుకు ఒక్కరోజు మినహాయింపు ఇచ్చిన కోర్టు

జగన్‌ వ్యక్తిగత హాజరుకు ఒక్కరోజు మినహాయింపు ఇచ్చిన కోర్టు

జగన్‌ వ్యక్తిగత హాజరుకు ఒక్కరోజు మినహాయింపు ఇచ్చిన కోర్టు

హైదరాబాద్‌ జనవరి 17, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. ఈ కేసులో ఈ వారానికి జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయంపు ఇచ్చింది. దీని కోసం జగన్ ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు. జగన్ తన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఏపీకి సీఎం అయిన తర్వాత అధికారిక, ఇతరాత్ర కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి. కాగా ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేసు విచారణ ఈనెల 24కు వాయిదాపడడంతో జగన్‌కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts