YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక మద్యం స్వాధీనం
కర్నూలు జనవరి 17, 
కర్నూల్ జిల్లా హోళగుంద మండలం కోయిల తోట గ్రామంలో కర్ణాటక మద్యం నిల్వ ఉంచారు అన్న సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో 20 కర్ణాటక మద్యం బాక్సులు స్వాధీనం చేసుకుని. ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ కృష్ణకుమార్ విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు మేరకు కోయిల తోట మారెమ్మ అవ్వ దేవర ఉన్నందున శేఖర్ అనే వ్యక్తి దేవర లో విక్రయించి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కర్ణాటక మద్యం తీసుకువచ్చి గ్రామానికి చెందిన తిమ్మప్ప ఇంట్లో నిల్వ ఉంచారని చెప్పారు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేయగా కర్ణాటకకు చెందిన ఒరిజినల్ చాయిస్ విస్కీ 90 ఎం.ఎల్ టెట్రా ప్యాకెట్లు 10 బాక్స్ లు ఓటి రెండు బాక్సులు 8 పీఎం లు బాక్సులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు కర్ణాటక మద్యం సరఫరా చేసినట్లు తెలిసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేసులు పెట్టినా సరైన మార్గంలో రానిపక్షంలో వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని చెప్పారు ఈ దాడుల్లో ఎస్సై ప్రసాదరావు సతీష్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ సాబ్ సిబ్బంది రాజేంద్ర మధు ఉ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts