YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నవ్వుకోండి దేశీయం

అబ్బాయి తండ్రి, అమ్మాయి తల్లి జంప్... ఆగిపోయిన పెళ్లి

అబ్బాయి తండ్రి, అమ్మాయి తల్లి జంప్... ఆగిపోయిన పెళ్లి

 అబ్బాయి తండ్రి, అమ్మాయి తల్లి జంప్... ఆగిపోయిన పెళ్లి
గాంధీనగర్, జనవరి 21, 
నిశ్చితార్థం అయింది.. త్వరలోనే పెళ్లి.. అంతలోనే వరుడి తండ్రి, వధువు తల్లి కలిసి జంప్‌ అయ్యారు. తమ వివాహ బంధంపై ఎన్నో కలలు కన్న ఆ నూతన జంటకు తమ పేరెంట్స్‌ ఊహించని షాకిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని సూరత్‌లో నివాసముంటున్న రాకేశ్‌(48), స్వాతి(46) చిన్నప్పట్నుంచి మంచి దోస్తులు. అయితే వీరిద్దరూ చిన్ననాడే ప్రేమించుకున్నారు. కానీ నాడు వీరిద్దరికి పెళ్లి కాలేదు. ఇటీవలే రాకేశ్‌ కుమారుడితో స్వాతి కుమార్తెకు నిశ్చితార్థం జరిగింది.ఇక ఎంగేజ్‌మెంట్‌ అయినప్పటి నుంచి స్వాతి, రాకేశ్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్ననాటి స్మృతులు గుర్తుకు వచ్చాయి. ఈ పెళ్లి జరిగితే అన్నాచెల్లి వరుస అవుతుందని భావించినా ఆ ప్రేమికులిద్దరూ లేచిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వివాహం ఉండగా.. పది రోజుల క్రితం రాకేశ్‌, స్వాతి తమ నివాసాల నుంచి పరార్‌ అయ్యారు. దీంతో నూతన జంట వివాహం ఆగిపోయింది. ఇక పోలీసు స్టేషన్లలో రాకేశ్‌, స్వాతి అదృశ్యమైనట్లు ఫిర్యాదులు చేశారు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే స్వాతికి వజ్రాల వ్యాపారితో వివాహం కాగా, ఆ తర్వాత అతను బ్రోకర్‌గా మారాడు. రాకేశ్‌ ఏమో వస్ర్తాల వ్యాపారి. రాజకీయ నాయకుడు కూడా. ఇలా మొత్తానికి వారిద్దరి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని మరోసారి ప్రేమలో మునిగిపోయారు.

Related Posts