YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఐటి దాడుల సాకుతో టిడిపిపై దుష్ప్రచారాన్ని ఖండించిన యనమల

ఐటి దాడుల సాకుతో టిడిపిపై దుష్ప్రచారాన్ని ఖండించిన యనమల

ఐటి దాడుల సాకుతో టిడిపిపై దుష్ప్రచారాన్ని ఖండించిన యనమల
--వైసిపి నేతలపై, సాక్షి మీడియాపై యనమల ఆగ్రహం
ఫిబ్రవరి 14,
ఐటి దాడుల సాకుతో వైసీపీ నేతలు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇలాంటి ప్రచారం మానుకోకపోతే... వైసీపీ నేతలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పిఏలు, పిఎస్‌లకు పార్టీకి సంబంధం ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పిఎస్ శ్రీనివాస్‌కు టిడిపితో ఏం సంబంధం ఉంటుందని... అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే అని అన్నారు. ఆయనపై ఐటీ దాడులు పూర్తిగా వ్యక్తిగతమని... వాటిని టిడిపికి ముడిపెట్టడం కావాలని బురద జల్లడమే అని యనమల ఆరోపించారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10-15మంది పిఎస్‌లు, పిఏలు పని చేశారని యనమల అన్నారు. దేశవ్యాప్తంగా 40చోట్ల దాడులకు టిడిపికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారని..సభా సంఘాలు, న్యాయ విచారణలు, సిబిసిఐడి అన్నీ చేశారని యనమల గుర్తు చేశారు. ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారని అన్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి తాను తప్పించుకోవడం, ఎదుటివాళ్లపై దాడులు చేయడమే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. టిడిపిపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని... ఢిల్లీలో ఆయనను ప్రత్యేక ప్రతినిధిగా చేసింది కూడా టిడిపిపై ఫిర్యాదుల కోసమే అని యనమల ఆరోపించారు. జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయిరెడ్డే అని... వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. జగన్ రూ. 43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందని... రూ. 4వేల కోట్ల జగన్ ఆస్తులను ఈడి జప్తు చేసిందని యనమల ఆరోపించారు. శిక్ష తప్పదని తెలిసే జగన్ ట్రయల్స్‌ను అడ్డుకుంటున్నారని అన్నారు. 8 ఏళ్లుగా సిబిఐ, ఈడి ఎంక్వైరీకి అడ్డంకులు పెడుతున్నారని... కోర్టుకు హాజరు కాకుండా పదేపదే మినహాయింపులు కోరేది అందుకే అని విమర్శించారు. టిడిపి, వైసిపి ఏది ఎలాంటి పార్టీయో ప్రజలందరికీ తెలిసిందే,  టిడిపి నిప్పులాంటి పార్టీ, నీతి నిజాయితీలున్న పార్టీ, తప్పుడు పనులు చేసే పార్టీ టిడిపి కాదని అన్నారు. చంద్రబాబుపై గతంలోనే 26ఎంక్వైరీలు వేశారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సిబిసిఐడి అన్నీ చేశారు. ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారు. ఏనాడన్నా జగన్ అవినీతిపై సాక్షి పత్రిక రాసిందా..? సాక్షి ఛానల్ ప్రసారం చేసిందా..? సిబిఐ, ఈడి కౌంటర్ పిటిషన్ల గురించి చెప్పిందా..? చంద్రబాబు మాజీ పిఎస్ పై దాడులకు ఇచ్చిన ప్రాధాన్యం, జగన్ ఆస్తుల ఈడి జప్తుపై ఇచ్చిందా..? జగన్ 43వేల కోట్ల అవినీతిపై సిబిఐ అఫిడవిట్ పై సాక్షి రాసిందా..? అదే సాక్షికి, ఇతర మీడియాకు ఉన్న వ్యత్యాసమని.. టిడిపిపై సాక్షి మీడియా, వైసిపి నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. దీనిని మానుకోకపోతే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts