YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కన్న కొడుకులనుంచి ప్రాణహాని వుంది

కన్న కొడుకులనుంచి ప్రాణహాని వుంది

హైదరాబాద్
కన్న కొడుకుల నుండి ప్రాణహాని ఉందంటూ , ఓ వృద్ధ కన్న తల్లి రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్ గిరి కు చెందిన 67 ఏళ్ల భద్రమ్మ తన గోడును వెళ్లబోసుకుంది. తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని ... తన కొడుకులు అనిల్ , వినయ్ లు అక్రమంగా ఆక్రమించుకొని తనను రోడ్డుపాలు చేశారని కన్నీరు పెట్టుకుంది. తన కూతురు చేరదీయకపోతే అడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేసింది. మూడు కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయలని నకిలీ పత్రాలను సృష్టించారని భద్రమ్మ తెలిపింది. దీనిపై మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో తన కొడుకుల పై ఫోర్జరీ కేసు నమోదు చేసిన , ఇప్పటికి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తనను ఎలాగైనా అంతమొంధించి ఆస్తిని కాజేయలని చూస్తున్నారని... తన కొడుకులు అనిల్ , వినయ్ లపై చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని భద్రమ్మ పోలీసులను వేడుకుంది.

Related Posts