YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో దారుణం

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో దారుణం

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో దారుణం
-తల్లి ,కూతురును హత్య చేసిన రెహమాన్ అనే వ్యక్తి..
-తల్లి ఫారీదా బేగం, కూతురు సైజాబేగం..
హైదరాబాద్‌, ఫిబ్రవరి 14,
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ రోజు ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి ఘాజీమిల్లత్ నల్లవాగులోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఫారీదా బేగం మరిది రెహమాన్ ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తాళ్ల కుంట ప్రాంతంలో ఓ ఇంట్లో తల్లి కూతురు లను దారుణ హత్య అనే సమాచారం ఇచిన్న తండ్రి మొహమ్మద్ హుసైన్. గత కొద్ది రోజుల గా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అల్లుడు మెహతాబ్ ఖురేషి 50 మరిది రెహ్మాన్ ఖురేషి ఈ దారుణనికి ఒడిగట్టినట్లు స్థానికుల సమాచారం. ఈ రోజు ఉదయం ఫారీదా బేగం ఇద్దరు కూతుళ్లు స్కూల్ కి వెళ్లగా తల్లి షాజాది బేగం కూతురు ఫారీదా బేగం ఇంట్లో ఉన్నరు, తండ్రి మొహమ్మద్ హుసైన్ 8గంటల ప్రాంతం లో హోటల్ కి వెళ్లి వచ్చేలోపే తల్లి కూతుర్లు కత్తి పోట్ల తో రక్తం మడుగు లో ఉన్నారు.వెంటనే స్థానికుల సహకారం తో పోలీసులకి సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఏసీపీ యం.ఎ.మజీద్ చేరుకొని క్లూస్ టీం తో ఆధారాలు సేకరుస్తున్నారు.స్థానిక మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబడార్, ముఫ్తార్ అహ్మద్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించేయందుకు సహాయ సహకారాలు చేశారు.

Related Posts