YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అర్జున్ దాస్ అందోళన

అర్జున్ దాస్ అందోళన

అర్జున్ దాస్ అందోళన
తిరుపతి ఫిబ్రవరి 14
తిరుపతిలోని హథీరాంజీ మఠంలో మహంత్ అర్జున్‌దాస్ ఆందోళనకు దిగారు. మఠం బాధ్యతలు స్వీకరించేందుకు మహంత్ అర్జున్‌దాస్ హథీరాంజీ మఠానికి చేరుకున్నారు. అయితే మహంత్‌కు బాధ్యతలు అప్పజెప్పకుండానే కస్డోడియన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్‌దాస్ మఠంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి దుర్మార్గాలు లేవని అన్నారు. తనను అడ్డు తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మఠం బాధ్యతలు అప్పగించకపోతే కోర్టు ధిక్కారణ అవుతుందని తెలిపారు. తనను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని మహంత్‌ అర్జున్‌దాస్ స్పష్టం చేశారు.2కోట్ల విలువైన మఠం నగలు తిరుపతి, చంద్రగిరి బ్యాంకుల్లో సురక్షితంగా ఉన్నాయని దాస్‌జీ తెలియజేశారు. ఇంకా లాకర్ తాళాలు తన దగ్గరే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమిలాలలోని రూ. 20కోట్ల విలువైన భూమిని ప్రస్తుత మఠ మహంతు అర్జున్‌దాస్ అమ్మేందుకు యత్నించారని దేవేంద్రదాస్ ఆరోపించారు.

Related Posts