YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

175 మంది ఎమ్మెల్యేలలో 101 మందిపై కేసులు

175 మంది ఎమ్మెల్యేలలో 101 మందిపై కేసులు

175 మంది ఎమ్మెల్యేలలో 101 మందిపై కేసులు
విజయవాడ, ఫిబ్రవరి 14 
క్రిమినల్ రికార్డులు ఉన్న రాజకీయ నేతలకు ఎందుకు టిక్కెట్లు కేటాయిస్తున్నారో కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల తమ అధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపర్చాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలు కేసుల చిట్టాను సిద్ధం చేస్తున్నాయి.. తమ వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచే పనిలో ఉన్నాయి.ఏపీ విషయానికి వస్తే.. కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి మొత్తం 86మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నట్లు తేలింది.. అలాగే 9మంది ఎంపీలపై కేసులు ఉన్నాయట. టీడీపీ విషయానికి వస్తే 15మంది నేతలపై కేసులు ఉన్నట్లు తేలిందట. రెండు పార్టీలు ఈ వివరాలను తమ వెబ్‌సైట్‌లో పెట్టేందుకు సిద్ధమయ్యారు.వైఎస్సార్‌సీపీ నుంచి కేసుల ఉన్న ప్రజా ప్రతినిధులు.. అత్యధికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై 38 కేసులు ఉన్నాయట. ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. సామినేని ఉదయ భాను-18, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి-15, దాడిశెట్టి రాజా-17, కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి-7, కేతిరెడ్డి పెద్దారెడ్డి-8, జక్కంపూడి రాజా-6, ఆళ్ల రామకృష్ణారెడ్డి-7 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలలో మరికొందరిపై ఒకటి రెండు కేసులు ఉన్నాయట.టీడీపీ నేతల విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒక్క కేసు మాత్రమే ఉందట. టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి-2, అనగాని సత్యప్రసాద్-1, కింజరాపు అచ్చెన్నాయుడు-1, వాసుపల్లి గణేష్‌కుమార్-3 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేల్లో మరికొందరిపై కేసులు ఉన్నట్లు  సమచారం.వైఎస్సార్‌సీపీ ఎంపీలపై కేసుల విషయానికి వస్తే.. విజయసాయిరెడ్డిపై అత్యధికంంగా-13, గోరంట్ల మాధవ్-2, వైఎస్ అవినాష్‌రెడ్డి-4, రఘురామకృష్ణంరాజు-6 కేసులు ఉన్నాయట. మిగిలిన మరికొందరు ఎంపీలపై చిన్నా, చితక కేసులు ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఎంపీలపై కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.. వివరాలు తెలియాల్సి ఉంది.నేర చరితులకు ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించడంపై రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరస్థులకు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా నిరోధించడానికి సరికొత్త విధానం తీసుకొచ్చేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత, సీనియర్‌ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలుచేసిన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టువిచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. క్రిమినల్ రికార్డులు ఉన్నవారికి ఎందుకు టిక్కెట్లు కేటాయిస్తున్నారో గల కారణాలను తమ పార్టీల అధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపర్చాలని సూచించింది.నేర చరితులకు టిక్కెట్లను కేటాయించే విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ అంశాన్ని మరోసారి పరిశీలించడానికి ఇటీవల సమ్మతించిన సుప్రీం.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యను నియంత్రించడానికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడుతున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Related Posts