పుల్వామా అమరులకు జోహార్లు
ఫిబ్రవరి 14
గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల కార్ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40మంది వీర జవానుల ను స్మరిస్తూ ఐ స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో మరణించిన సైనికులకు నివాళులు అర్పించారు ఈసందర్భంగా బెల్లంపల్లి ,శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు బెల్లంపల్లి లోని పాలిటెక్నిక్ కాలేజి విద్యార్థులు ప్రజలు యువకులు స్వచ్ఛంద సంస్థలు స్థానిక తిలక్ స్టేడియం నుండి ఏఎంసీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు, మూడు గంటలపదిహేను నిమిషాలకు జాతీయ గీతాన్ని ఆలపించారు దేశంలోని ప్రజలందరూ సురక్షితంగా సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులే అలాంటి మన సైనికుల పై దాడి జరగడం చాలా బాధాకరమైన విషయం అని,వారి ఆత్మకు శాంతి కలగాలని వారి త్యాగాలు భారతీయులు ఎన్నటికీ మరువలేమని ప్రతి భారతీయుడు ఆలోచించాలి అని పేర్కొన్నారు,అలాగే జిల్లడ గ్రామంలో నూతనంగా పెళ్లి చేసుకున్న రాజశేఖర్ పద్మ దంపతులు కూడా సైనికులకు నివాళులు అర్పించారు,.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిలికృష్ణ గడ్డం అశోక్ అనితా రాజులాల్ యాదవ్ మరియు అడెపు సతీష్, వినయ్,సంతోష్,రవీందర్,నాదిర్ష నక్వీ, హనుమండ్ల మధు,డాక్టర్ రేణికుంట్ల శ్రీనివాస్ రాజేందర్, ఆకాష్,పుదరి సత్యనారాయణ మ్యాదరి రాకేష్, కొలిపాక శ్రీనివాస్, చాంద్ పాషా, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.