YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 28 దేశాల్లో కొవిడ్ 19

 28 దేశాల్లో కొవిడ్ 19

 28 దేశాల్లో కొవిడ్ 19
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 
వుహాన్‌లో వెలుగుచూసిన ప్రాణాంతక వైరస్ కొవిడ్ 19 ప్రస్తుతం 28 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌తో ఇప్పటి వరకూ 1,600 మంది ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 66,000వేలు దాటింది. ఈ నేపథ్యంలో వుహాన్‌లో చిక్కుకున్న తమ పౌరులను అన్ని దేశాలూ స్వస్థలాలకు తరలించాయి. అలాగే, జనవరి 15 తర్వాత అక్కడ నుంచి వచ్చిన పౌరులను నిర్బంధంలో ఉంచి వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భారత్‌లోనూ మూడు కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఈ ముగ్గురూ వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. తాజాగా, ఒడిశా ప్రభుత్వం సైతం ఇతర దేశాల నుంచి వచ్చిన దాదాపు 83 మందిని ఇళ్లకే పరిమితం చేసింది.జనవరి 15 తర్వాత వీరంతా భారత్‌కు తిరిగొచ్చినట్టు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం నిరంతరాయంగా పనిచేసే కంట్రోల్ రూమ్‌ను వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటుచేసింది. వైరస్‌ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోడానికి ఓ హెల్ప్‌లైన్‌ నెంబరును అందుబాటులోకి తెచ్చింది.కరోనా వైరస్ బాధితుల కోసం భువనేశ్వర్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 80 పడకలను సిద్ధం చేసింది. అయితే, ప్రస్తుతానికి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. కరోనా లక్షణాలున్నట్టు అనుమానించిన ముగ్గురికి నమూనా పరీక్షల్లో వ్యాధి సోకలేదని నిర్ధారణ కావడంతో వారిని ఇళ్లకు పంపిచామని, ప్రస్తుతం ఈ విభాగం ఖాళీగా ఉందని అధికారులు తెలిపారు. మరో ఏడుగురి నమూనాలనూ పరీక్షలు పంపగా వారికి కూడా కరోనా వైరస్ లేదని తేలిందన్నారు.మరోవైపు, కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావం వాలంటైన్స్ డేపై పడింది. ఏటా ఉత్సాహంగా ప్రేమికుల దినోత్సవం జరుపుకొనే హాంకాంగ్‌, సింగ్‌పూర్‌ లాంటి దేశాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మాస్కులు ధరించి ప్రేమికులు అక్కడక్కడ వీధుల్లో కనిపించారు. ఆరోజు డిమాండ్‌ ఎక్కువగా ఉండే గులాబీ పూల మార్కెట్లన్నీ ఈసారి వెలవెలబోయాయి.

Related Posts