YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీడీపీ నేతలను కొనుక్కుంటున్నారు...

టీడీపీ నేతలను కొనుక్కుంటున్నారు...

తెలుగుదేశం నేతలను కొనుక్కుంటున్నారు... లేకపొతే లొంగదీసుకుంటున్నారని టీ టీడీపీ సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం రావుల మీడియాతో మాట్లాడుతూ... ఒంటెరు ప్రతాప్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల గురించి కేంద్ర హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే పార్టీ పటిష్టతకు పల్లె పల్లెకు తెలుగుదేశం, ఈ నెల 23 నుంచి నాలుగో విడత శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. ఇదిలా ఉండగా టీడీపీని టీఆర్ఎస్ లో కలిపేయండి అంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ తీసుకున్న అనంతరం అవసరమైతే కేంద్ర కమిటీకి నివేదిక పంపిస్తామని రావుల పేర్కొన్నారు.

Related Posts