YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 డౌన్ ట్రెండ్ లోనే బంగారం, వెండి 

Highlights

 డౌన్ ట్రెండ్ లోనే బంగారం, వెండి 
ముంబై, ఫిబ్రవరి 19
పసిడి మళ్లీ తగ్గింది. వెలవెలబోయింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి 2 రోజులుగా ధర తగ్గుతూనే రావడం నిజంగా శుభవార్తనే. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.కరోనా వైరస్ కారణంగా చైనాలో మరణాల సంఖ్య పెరుగుతూనే రావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. అయితే దేశీ మార్కెట్‌లో మాత్రం జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి పసిడి డిమాండ్ తగ్గింది. దీంతో బంగారం ధర స్వల్పంగా కిందకు దిగింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 0.41 శాతం ర్యాలీ చేసింది. 1,592.75 డాలర్లకు పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 1.06 శాతం పెరుగుదలతో 17.92 డాలర్లకు చేరింది.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.20 క్షీణించింది. దీంతో రూ.39,150 నుంచి రూ.39,130కు తగ్గింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,640 వద్దనే నిలకడగానే ఉంది.బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.49,550 నుంచి రూ.49,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ,  విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,130కు క్షీణించింది. వెండి ధర రూ.49,500కు తగ్గింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. రూ.41,150 వద్దనే ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.39,950 వద్దనే కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.49,500కు తగ్గింది.పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చుబంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

 డౌన్ ట్రెండ్ లోనే బంగారం, వెండి 

Related Posts