YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆస్తి-పాస్తులు దేశీయం

ట్రంప్ పర్యటన పుణ్యమా అని రోడ్డున పడ్డ 45 కుటుంబాలు 

ట్రంప్ పర్యటన పుణ్యమా అని రోడ్డున పడ్డ 45 కుటుంబాలు 

ట్రంప్ పర్యటన పుణ్యమా అని రోడ్డున పడ్డ 45 కుటుంబాలు 
అహ్మదాబాద్ ఫిబ్రవరి 19 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన పుణ్యమా అని 45 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ఉన్న ఓ మురికివాడలోని కుటుంబాలకు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అగ్రరాజ్య అధినేతకు మన దేశ పేదరికం కనిపించకుండా ఇప్పటికే కిలోమీటరున్న గోడను కట్టేయడం తెలిసిందే. అది సరిపోదని మరో 45 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు హుకుం జారీచేశారు.మంగళవారంలోగా వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో పేదసాదలు గోడుగోడున విలపిస్తున్నారు. పాతికేళ్లుగా  ఇక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్నామని, ఎవడో వస్తున్నాడని తమను తరిమేడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఈ నెల 24న గుజరాత్‌కు వస్తున్నాడు. దీని కోసం గుజరాత్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ముతేరా స్టేడియాన్ని నిర్మించిన ప్రభుత్వం ట్రంప్‌తో దాన్ని ఆవిష్కరిస్తోంది. స్టేడియం దగ్గర్లోని దేవ్ సరన్ మురికివాడ  
కనిపించకుండా గోడ కట్టేశారు.

Related Posts