YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్

 విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్

 విశాఖలో ఇన్ సైడ్ ట్రేడింగ్
విశాఖపట్నం ఫిబ్రవరి 19
వారం రోజులుగా విశాఖ లో ల్యాండ్ పూలింగ్ పేరుతో నిబంధనలు తుంగలో తొక్కి రెవెన్యూ శాఖ దిగజారిందని మండిపడ్డారు మాజీమంత్రి బండారు సత్యనారాయణ. 50, 60 సంవత్సరాలుగా ఎస్సీలు సాగు చేస్తున్న భూములు బలవంతంగా లాక్కుంటున్నారని,పద్మనాభం, మునగపాక, పెందుర్తి మండలాల్లో బలవంతపు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆరోపించారు.సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా, మామిడి, జీడీ తోటలకు నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నారు.ఆక్రమణ దారులకు వైస్సార్ పార్టీ వాళ్లకు ఒక రకంగా మరో పార్టీ వాళ్లకు ఒకరకమైన పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు.రైతులు అంగీకారం లేకుండా భూములు ఎలా సేకరిస్తారని నిలదీశారు.అమరావతి  రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ జరిగింది ఏమిటని  అయన ప్రశ్నించారు.

Related Posts