YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆస్తి-పాస్తులు ఆంధ్ర ప్రదేశ్

నారా వారి ఆస్తులు చిట్టా

నారా వారి ఆస్తులు చిట్టా

నారా వారి ఆస్తులు చిట్టా
హైద్రాబాద్, ఫిబ్రవరి 20  
టీడీపీ నేత నారా లోకేశ్ తన ఆస్తులను ప్రకటించారు. తాము కొనుగోలు చేసిన ధరల ప్రకారమే ఆస్తులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తులను ప్రకటించమన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆస్తులను సంపాదించడం మాకు తెలీదన్నారు. కుటుంబానికి ఆర్థిక స్వాతంత్య్రం కోసం 25 ఏళ్ల క్రితం హెరిటేజ్‌ను స్థాపించామన్నారు. హెరిటేజ్ ద్వారా గత ఏడాది రూ.83 కోట్ల ఆదాయం లభించిందన్నారు. హెరిటేజ్ ద్వారా నేరుగా 3 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. నారా భువనేశ్వరి, తన భార్య బ్రాహ్మణి ఇద్దరూ హెరిటేజ్ కోసం పని చేస్తున్నారని లోకేశ్ తెలిపారు.9 ఏళ్ల నుంచి తాము ప్రతి ఏటా ఆస్తులను ప్రకటిస్తున్నామన్న లోకేశ్.. మమ్మల్ని విమర్శించే ముందు.. మీ ఆస్తులను ప్రకటించడంటూ.. వైఎస్సార్సీపీ నేతలకు సవాల్ విసిరారు. డిజిటల్ కరెన్సీ వాడకాన్ని పెంచడం కోసం పెద్ద నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు ముందుగా చెప్పారన్నారు.చంద్రబాబు నాయుడు ఆస్తులు గత ఏడాది కంటే రూ.87 లక్షలు పెరిగాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు రూ.70 లక్షలు పెరిగింది. బ్యాంకు రుణాలు రూ.18 లక్షలు తగ్గింది. చంద్రబాబు ఆస్తి విలువ రూ.9 కోట్లు, అప్పులు రూ.5.13 కోట్లు. నికర ఆస్తులు రూ.3.87 కోట్లు.నారా భువనేశ్వరి ఆస్తి.. పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.40 లక్షలు పెరిగింది. ఇతర నగదు రూ.3.16 కోట్లు తగ్గింది. బ్యాంకు బాలెన్స్ రూ.1.30 లక్షలు పెరిగింది. ఓవరాల్‌గా ఆమె ఆస్తులు రూ.53.37 కోట్ల నుంచి రూ.50.62 కోట్లకు తగ్గాయి. అప్పులు.. రూ.22 కోట్ల 35 లక్షల నుంచి రూ.11.04 కోట్లకు తగ్గాయి.లోకేశ్ ఆస్తులు.. నిర్వాణ హోల్డింగ్‌లో షేర్లను బ్రాహ్మణికి గిఫ్ట్‌గా ఇచ్చారు. అదర్ లిక్విడ్ అసెట్స్ రూ.9.53 కోట్ల నుంచి రూ.8.14 కోట్లకు తగ్గాయి. బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూ.43 లక్షలు పెరిగాయి. మొత్తం ఆస్తులు రూ.27.29 కోట్ల నుంచి రూ.24.70 కోట్లకు తగ్గాయి. అప్పులు రూ.5.80 కోట్ల నుంచి రూ.5.70 కోట్లకు తగ్గాయి. నికర ఆస్తులు రూ.2.40 కోట్లు తగ్గాయి.బ్రాహ్మణి ఆస్తులు రూ.1.62 లక్షలు నిర్వాణ షేర్ల ద్వారా పెరిగింది. ఎల్ఐసీ రూ.6 లక్షలు పెరిగింది. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.38 లక్షల నుంచి రూ.57 లక్షలకు పెరిగింది. ఇతర ఆస్తులు రూ.39 లక్షల నుంచి రూ.81 లక్షలకు పెరిగాయి. ఆమె మొత్తం ఆస్తులు రూ.11.38 కోట్ల నుంచి రూ.15.68 కోట్లకు పెరిగాయి. అప్పులు రూ.5.66 కోట్ల నుంచి రూ.4.17 కోట్లకు తగ్గింది. బ్రాహ్మణి నికరాస్తులు రూ.7.72 కోట్ల నుంచి రూ.11.51 కోట్లకు పెరిగాయి. ఏడాదిలో నికరాస్తులు రూ.3.81 కోట్లు పెరిగాయి.దేవాన్ష్ ఆస్తులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2.49 కోట్ల నుంచి రూ.3.18 కోట్లకు పెరిగాయి. తాతయ్య దగ్గర్నుంచి 26,440 హెరిటేజ్ షేర్లు గిఫ్ట్‌గా వచ్చాయి. బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూ.70 వేలు పెరిగాయి. గతేడాది దేవాన్ష్ ఆస్తులు రూ.18.71 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.19.42 కోట్లకు చేరాయి. ఏడాదిలో దేవాన్ష్ ఆస్తులు రూ.41 లక్షల మేర పెరిగాయి.

Related Posts