YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

.కివీస్ లో ఇండియా వైట్ వాష్

.కివీస్ లో ఇండియా వైట్ వాష్

.కివీస్ లో ఇండియా వైట్ వాష్
ముంబై, మార్చ్ 2 
న్యూజిలాండ్ గడ్డపై భారత్ పర్యటన ఘోర పరాభవంతో ముగిసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా సోమవారం ముగిసిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన టీమిండియా.. 7 వికెట్ల తేడాతో కివీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇటీవల వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టు.. రెండు టెస్టుల సిరీస్‌లో 0- 2తో వైట్‌వాష్‌కి గురైంది. ఈ సిరీస్‌కి ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని కూడా 0-3తో చేజార్చుకున్న టీమిండియా.. మొదట జరిగిన ఐదు టీ20 సిరీస్‌ని మాత్రం 5-0తో గెలిచిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టు నుంచి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలవగా.. అప్పటి నుంచి భారత్ జట్టు ఓ టెస్టు సిరీస్‌ని ఓడటం ఇదే తొలిసారి.క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 242 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఓపెనర్ పృథ్వీ షా (54: 64 బంతుల్లో 8x4, 1x6), చతేశ్వర్ పుజారా (54: 140 బంతుల్లో 6x4), హనుమ విహారి (55: 70 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), వైస్ట్‌ కెప్టెన్ అజింక్య రహానె (7), రిషబ్ పంత్ (12) తేలిపోయారు. కివీస్ బౌలర్లలో జెమీషన్‌ ఐదు వికెట్లతో సత్తాచాటాడు.భారత్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ టీమ్‌ 235 పరుగులకే చేతులెత్తేసింది. మహ్మద్ షమీ 4, జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్ల పడగొట్టడంతో కివీస్ టాప్ ఆర్డర్ ఆశించిన మేర రాణించలేకపోయింది. కానీ.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జెమీషన్ (49: 63 బంతుల్లో 7x4) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ టామ్ లాథమ్ (52: 122 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటవడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేసిన భారత్‌కి కేవలం 7 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్‌ని 7 పరుగుల ఆధిక్యంతో ప్రారంభించిన భారత్ జట్టు అనూహ్యంగా 124 పరుగులకే కుప్పకూలిపోయింది. చతేశ్వర్ పుజారా 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోహ్లీ (14), రహానె (9), రిషబ్ పంత్ (4), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (3) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేశారు. దీంతో.. కివీస్ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా నిలపగలిగింది. తొలి టెస్టులోనూ 9 పరుగుల లక్ష్యాన్నే కివీస్ ముందు భారత్ నిలిపిన విషయం తెలిసిందే.రెండో టెస్టులో 132 పరుగుల లక్ష్య ఛేదనని ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్ (52: 74 బంతుల్లో 10x4), టామ్ బ్లండెల్ (55: 113 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీలు బాదేసి తొలి వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. గెలుపు ముంగిట ఇద్దరూ ఔటవగా.. ఆఖర్లో రాస్‌టేలర్ (5 నాటౌట్: 9 బంతుల్లో 1x4), హెన్రీ నికోలస్ (5 నాటౌట్: 13 బంతుల్లో 1x4) గెలుపు లాంఛనాన్ని 132/3 పూర్తిచేశారు.

Related Posts