YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 బంగారం ధర తగ్గుదలకు బ్రేక్

 బంగారం ధర తగ్గుదలకు బ్రేక్

 బంగారం ధర తగ్గుదలకు బ్రేక్
ముంబై, మార్చి 3
బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ఈ రోజు పరుగులు పెట్టింది. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులతోపాటు దేశీయంగా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి కన్నా ఎక్కువగానే వెండి ధర పెరిగింది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో పసిడి ధర గ్లోబల్ మార్కెట్‌లో మళ్లీ ఒక్కసారిగా పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌లోనూ పసిడి ధర పైపైకి కదిలింది. ఇకపోతే మన దేశంలోనూ ఇప్పుడు కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఐదుకు చేరిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇకపోతే దేశీ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదలకు అంతర్జాతీయ రేట్లతోపాటు దేశీ పరిస్థితులు కూడా దోహపడ్డాయి. మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రూపాయిపై ఎఫెక్ట్ పడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడింది. మళ్లీ 72 మార్క్ కిందకు (72.73) పడిపోయింది. ఏడాది కనిష్ట స్థాయికి పతనమైంది. రూపాయి బలహీనపడటం వల్ల బంగారం దిగుమతుల భారం పెరుగుతుంది. దీంతో పసిడి ధర పెరుగుతుంది.హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. రూ.110 మేర పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,870 నుంచి రూ.39,980కు పెరిగింది. అంటే పసిడి ధర మళ్లీ రూ.40 వేల మార్క్ దగ్గరకు చేరిందని చెప్పుకోవచ్చు.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. ఇది కూడా రూ.110 పెరిగింది. దీంతో ధర రూ.43,670 నుంచి రూ.43,780కు చేరింది. ఇకపోతే బంగారం ధర గత రెండు రోజుల్లో దాదాపు రూ.1000 మేర దిగొచ్చిన విషయం తెలిసిందే.బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. పసిడి ధర కన్నా వెండి ధర ఇంకా ఎక్కువగానే పెరిగింది. కేజీ వెండి ధర రూ.250 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500 నుంచి రూ.48,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. మళ్లీ 1600 డాలర్ల మార్క్ పైకి చేరింది. బంగారం ధర ఔన్స్‌కు ఏకంగా 2.29 శాతం పెరుగుదలతో 1602.55 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు ఏకంగా 1.92 శాతం పెరుగుదలతో 16.77 డాలర్లకు చేరింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.39,980కు చేరింది. వెండి ధర రూ.48,750కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర రూ.90 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40,800కు చేరింది.గతేడాది బంగారం ధర ఏకంగా 25 శాతం మేర పరుగులు పెట్టింది. ఇప్పుడు పుత్తడి ఈ కొత్త ఏడాదిలోనూ దూకుడు కనబరుస్తోంది. బంగారం ధర 2020 ఆరంభం నుంచే పరుగులు పెడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 8 శాతం మేర పెరిగింది. దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వెండి ధర కూడా వెలిగిపోతోంది. దేశీ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదల సహా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటంతో బంగారం ధర పైపైకి కదులుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts