YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మళ్లీ కుప్పకూలిన మార్కెట్

మళ్లీ కుప్పకూలిన మార్కెట్

మళ్లీ కుప్పకూలిన మార్కెట్
ముంబై, మార్చి 4 
దేశీ స్టాక్ మార్కెట్‌కు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే ఉన్నాయి. వారం రోజుల తర్వాత నిన్న లాభపడిన బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం మళ్లీ  నష్టపోయాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్ 214 పాయింట్ల నష్టంతో 38,409 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో 11,251 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్,  ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
✺ నిఫ్టీ 50లో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, గెయిల్ షేర్లు లాభపడ్డాయి. సిప్లా ఏకంగా 5 శాతం పరుగులు పెట్టింది.
✺ అదేసమయంలో నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ ఏకంగా 6 శాతం పతనమైంది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా 
నష్టపోయాయి. ఇక నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. ఇక నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ కూడా  దాదాపు 1 శాతం పెరిగింది.
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. 73.30 వద్ద కదలాడుతోంది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.52 శాతం పెరుగుదలతో 52.13 డాలర్లకు  చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.49 శాతం పెరుగుదలతో 47.42 డాలర్లకు ఎగసింది.

Related Posts