YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

 మళ్లీ 1000 పెరిగిన బంగారం

 మళ్లీ 1000 పెరిగిన బంగారం

 మళ్లీ 1000 పెరిగిన బంగారం
ముంబై, మార్చి 7
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి భారీ ఝలక్. పసిడి ధర పరుగులు పెట్టింది. మళ్లీ భారీగా పెరిగింది. దీంతో ఇప్పుడు బంగారం కొనాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి కూడా జిగేల్‌మంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు సహా దేశీ మార్కెట్‌లో రూపాయి పతనం కావడం, కరోనా వైరస్ భయాలు వంటి అంశాలు కారణంగా బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పైపైకి కదిలింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,020 పెరుగుదలతో రూ.46,160కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఆకాశాన్ని తాకింది. 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరుగుదలతో రూ.42,310కు చేరింది.పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.1230 మేర పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.51,080కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం పెరిగింది. 1,675 డాలర్ల సమీపంలోకి చేరింది. బంగారం ధర ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 1674.35 డాలర్లకు పరుగులు పెట్టింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.30 శాతం తగ్గుదలతో 17.34 డాలర్లకు క్షీణించింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పైకి చేరింది. రూ.950 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరుగుదలతో రూ.43,200 ఎగసింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరుగుదలతో రూ.44,400కు చేరింది. ఇక వెండి ధర కూడా రూ.1230 పెరుగుదలతో రూ.51,080కు పరుగులు పెట్టింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts