YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏప్రిల్‌–జూన్‌ మధ్య గరంగరం 

Highlights

  • 2017ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎండీ గుర్తింపు 
ఏప్రిల్‌–జూన్‌ మధ్య గరంగరం 

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య సమయాన్ని ఐఎండీ వేసవి కాలంగా పరిగణిస్తుంది. గత సంవత్సరాల్లో మాదిరిగానే ఈ ఏడాది కూడా మధ్య, ఉత్తర భారతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించిపోతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. అయితే కోస్తా ఆంధ్ర ప్రాంతంతోపాటు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అప్పుడప్పుడు కురుస్తాయనీ, తద్వారా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొంటున్నారు.  రుతుపవనాలు సరైన సమయానికే వస్తాయనడానికి ఇదొక సూచిక కూడా అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదైనా.. 2017తో పోలిస్తే అవి తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తుండటం ఒకింత ఊరటనిచ్చే అంశం. కాగా 2017ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎండీ గుర్తించింది. 

Related Posts