YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సరిహద్దుల్లో క్వారంటైన్ కేంద్రాలు

సరిహద్దుల్లో క్వారంటైన్ కేంద్రాలు

సరిహద్దుల్లో క్వారంటైన్ కేంద్రాలు
అమరావతి మార్చి 26
సరిహద్దుల్లో ప్రయాణికుల ఇబ్బందులపై గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించారు.  ఏపీ, తెలంగాణ సరిహద్దులకు వైద్య బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని వెల్లడించారు.  సరిహద్దుల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నల్గొండ అధికారులను కూడా కోరతామన్నారు. నిబంధనల ప్రకారం వారిని వెంటనే ఊర్లలోకి అనుమతించలేమని స్పష్టం చేశారు.  క్వారంటైన్ గడువు తర్వాత మాత్రమే వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. క్వారంటైన్కు అంగీకరించే వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తామని తేల్చి చెప్పారు. రెవెన్యూ అధికారులను కూడా సరిహద్దు వద్దకు పంపిస్తున్నట్టు చెప్పారు.  తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో గురువారం తెల్లవారుజాము నుంచి వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Related Posts