ఎన్వోసీలు పూర్తిగా నిలిపివేశాం
హోం మంత్రి మహమూద్అలీ
హైదరాబాద్ మార్చి 26
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులెవరూ సొంత ఊళ్లకు వెళ్లొద్దని సూచించారు. ఎన్వోసీలు పూర్తిగా నిలిపివేశామన్నారు. హాస్టళ్ల నిర్వాహకులకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. హాస్టళ్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహమూద్అలీ హెచ్చరించారు.