YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా

తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా

తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా
వైద్య దంపతులకు కూడా
హైదరాబాద్ మార్చి 26
తెలంగాణ లో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.  కుత్బుల్లాపూర్ కు  చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్  నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.   కుత్బుల్లాపూర్ కు చెందిన వ్యక్తి ఇటీవల న్యూ ఢిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్ వచ్చినట్లు  ప్రభుత్వం తెలిపింది.  దోమలగూడలో 43 ఏళ్ల వైద్యుడి నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్య (39) కూ వైరస్ సోకింది.  గురువారం  తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన  వారి సంఖ్య 44కి చేరుకుంది. అదృష్టవశాత్తూ మరణాలు సంభవంచలేదు

Related Posts