YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులను  మట్టుబెట్టిన  భద్రతా బలగాలు

ఆప్ఘనిస్థాన్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ఉగ్రమూకల చెరలో చిక్కుకున్న 150మందికి పైగా అతిథులను ఎట్టకేలకు రక్షించగలిగారు భద్రతా సిబ్బంది. ఈ ఆపరేషన్‌లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. 5మంది పౌరులు మరణించారు. మరో ఆరు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెల్లడించిన అధికారులు ఆపరేషన్ ముగిసినట్లు తెలిపారు. అయితే వారు ఏ ఉగ్రసంస్థకు చెందిన వారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే శనివారం సాయంత్రం హోటల్‌ల్లో ఐటీ కాన్ఫిరెన్స్ జరుగుతుండగా.. అందులో 160కిపైగా అతిథులు పాల్గొన్నారు. ఆ సమయంలో హోటల్‌లోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు వెంటనే దాడి చేసి, అందరినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విషయం తెలిసిన భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించి అందరినీ రక్షించారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ..

Related Posts