YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

భారీగా పెరిగిన ఫీజులు

భారీగా పెరిగిన ఫీజులు

గుంటూరు : ప్రైవేటు పాఠశాలల దందా అప్పుడే మొదలైంది. గత ఏడాది నుంచి మొదలైన ముందస్తు విద్యావిధానం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా ప్రతీ సంవత్సరం జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది. సీబీఎస్ఈ విధానంలో విద్యా విధానం మారడంతో... ఏప్రిల్ నుంచే విద్యా సంవత్సరం ప్రారంభం చేస్తున్నారు. దీంతో మార్చి రెండో వారంలో పరీక్షలు నిర్వహించి... ఏప్రిల్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానం తరహాలో మార్చిలోనే విద్యార్థులకు పరీక్షలు పూర్తిచేసి ఏప్రిల్‌ నుంచి తర్వాత విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభింప చేయాలని ఆదేశించారు. క్లాసులు ప్రారంభం కావడంతో ఆ సమయంలోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.. దానిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఇంకా ప్రస్తుత సంవత్సర ఆఖరి త్రైమాసిక పరీక్షలు పూర్తికాకముందే పిల్లలపై ఫీజుల పేర ఒత్తిడి తీసుకొస్తున్నారు. నెలాఖరులోపు పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకురావడమే కాదు.. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఒక్కొక్కరిపైనా కచ్చితంగా కొత్త పిల్లలను చేర్పించే బాధ్యతను పెడుతున్నారు.. ఈ విధానం మంచిదనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.లేకపోతే మరుసటి ఏడాది ఉద్యోగాలకు రానక్కర్లేదని ఒక నెల జీతం కత్తిరిస్తామని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కరాఖండిగా తెగేసి చెబుతున్నాయి. . ఫీజు కూడా మొదటి విడతను జూన్‌ లేదా జూలైలో చెల్లించే వారు.విద్యా సంవత్సరం తరగతులు ముందస్తుగా ప్రారంభించినా దానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను పిల్లలతో కొనుగోలు చేయించకుండా తమ వద్ద అందుబాటులో ఉన్న పుస్తకాలతో ప్రాథమికంగా నెలరోజులపాటు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ఫీజు విషయానికొస్తే ఎప్పటి మాదిరిగానే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. అయితే ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కొన్ని కార్పొరేట్‌ పాఠశాలల్లో ఇప్పటికే పరీక్షలన్నీ పూర్తికాగా వారం రోజుల నుంచి ఫీజులు చెల్లించాలని సతాయిస్తున్నారు. పిల్లల పోరు పడలేక కొందరు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. కొంత మంది అయితే అప్పులు చేసి ఫీజులు చెల్లించడానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

Related Posts