YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

పాక్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

పాక్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

పాక్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ మే 23
పాకిస్థాన్‌ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పాకిస్థాన్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచి విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన  పీకే-303 విమానం కుప్పకూలింది. లాహోర్‌ నుంచి కరాచీకి వచ్చిన విమానం ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందు నివాసాలపై కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదాలు మరణాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts