YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ ఆస్థుల విషయంలో తప్పుడు ప్రచారం

టీటీడీ ఆస్థుల విషయంలో తప్పుడు ప్రచారం

టీటీడీ ఆస్థుల విషయంలో తప్పుడు ప్రచారం
విజయవాడ మే 27 
టిటిడి నిరర్దకఆస్దులు విక్రయించాలని టిడిపి ప్రభుత్వం హయాంలో సబ్ కమిటి వేశారు.ఆ సబ్ కమిటిలో భానుప్రకాష్ రెడ్డి,డిపి అనంత, సుచిత్రా ఎల్లా, సండ్ర వెంకటవీరయ్య (టిడిపి ఎంఎల్ఏ)లు ఉన్నారు.  సబ్ కమిటి వేసి దాదాపు 53 నిరర్ధక ఆస్ధులను గుర్తించారు.వాటిలో 50 ఆస్ధులను విక్రయించాలని స్వయానా బిజేపిసభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంతకం చేశారు.30-01-2016 నాడు ఈ సబ్ కమిటి నిర్ణయం తీసుకుందని రాష్ర్ట దేవాదాయశాఖమంత్రి  వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. హరిప్రసాద్ అని జనసేన తరపున కూడా మెంబర్ గా ఉన్నట్లు నాకు వ్యక్తిగతంగా సమాచారం ఉంది.జనసేన పవన్ కల్యాణ్ కూడా ఆరోజు చంద్రబాబు సంకలో ఉన్నారు. వీరందరూ కలసి టిటిడి ఆస్ధులు అమ్మాలని తీర్మానం చేసింది వాస్తవమా ...కాదా.కన్నాలక్ష్మీనారాయణ గారు సూటిగా సమాధానం చెప్పాలి. 50 ఆస్దులకు సంబంధించి విలువలు ఒక్కొక్కటి లక్షా పదివేలు..61 వేలు, లక్షాఇరవై వేలు.ఇదంతా కూడా చంద్రబాబు ప్రభుత్వంలో తయారైన తీర్మానం,అజెండా. వీటన్నింటిని పక్కన పెట్టి...... వాళ్లే అమ్మమని చెప్పి,దొంగతనం చేసి ఎదుటివారిపై నెట్టడం ఎంతవరకు సమంజసమని అయన ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ  దీక్ష చేశారు. ఆయన లావుగా ఉన్నారు కాబట్టి దీక్ష చేస్తే తప్పులేదు. అరకిలోనో, పావుకిలోనో తగ్గే అవకాశం ఉంది. అది కూడా ఏసిరూమ్ లో కూర్చుని చేశారు. ప్రజలకేమీ దానివల్ల లాభం లేదు గాని ఆయనకు హెల్త్ రీత్యా ఉపయోగపడచ్చు. ని వాస్తవం చెప్పాలి.భానుప్రకాష్ రెడ్డిగారు ఎందుకు మాట్లాడటం లేదు.ఇప్పుడు బయటకు రావడంలేదు. మొన్న పోతిరెడ్డిపాడు చూశాం.బిజేపి తెలంగాణాలో ఒక స్టాండ్,ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాండ్ తీసుకుంటోంది. అదే విధంగా కన్నాలక్ష్మీనారాయణ  ఒక స్టాండ్,భానుప్రకాష్ రెడ్డి  ఒక స్టాండ్ తీసుకున్నారు.  అధిష్టానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతివారికి తప్పుడు సమాచారం పంపిస్తున్నారు.ఈ ప్రభుత్వంలో హిందుత్వానికి తప్పుజరుగుతోంది.....హిందుత్వం అంటే ఏదో కన్నాలక్ష్మీనారాయణ ఇంట్లో పుట్టినట్లుగా..... హిందూసమాజాన్ని ఆయన ఒక్కడే ఉధ్దరిస్తున్నట్లుగా..... మాట్లాడుతున్నారు.ఆయన మాటలు చూస్తే చాలా సిగ్గేస్తుంది. చంద్రబాబు నలభై ఆలయాలు పడగొట్టినప్పుడు బిజేపి ఎందుకు మాట్లాడలేదు.గోదావరి,కృష్ణా పుష్కరాలు. అవి ఎప్పుడు వస్తాయో కూడా తేదీలతో సహా తెలుసు.అయినా కూడా నామినేటెడ్ వర్క్స్ లలో ఆరువేల కోట్ల ఖర్చుపెట్టారు.అంతా అవినీతి మయం.గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోయారు.వీటిపై కన్నాలక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదు. కేవలం చంద్రబాబుకు అమ్ముడుపోయి జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించలేక,సంక్షేమపధకాలు ఆగాయని గాని,అభివృధ్ది ఆగిందని చెప్పలేక, చివరకు హిందూమతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి కూడా ఒక రాజకీయనాయకుడేనా. అదే విధంగా చంద్రబాబునాయుడు అతని చేసిన తప్పును కూడా, ఈ ప్రభుత్వం చేసిందని చెప్పడం చాలాబాధాకరం.గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఆర్డర్ ను రద్దుచేస్తూ ముఖ్యమంత్రి గారి పేషినుంచి ఆదేశాలు ఇస్తే అది కూడా రాజకీయం అంటూ కన్నాలక్ష్మీనారాయణ  మాట్లాడుతున్నారని అన్నారు. డబ్బులు తీసుకుని,అమ్ముడుపోయినా ఇంతనీచరాజకీయాలు చేస్తారా.ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రభుత్వానికి వంక పెట్టాలని చూస్తున్నారా....సిగ్గుండాలని అన్నారు.టిటిడి ఆస్దులు చంద్రబాబు అమ్మాలని చూశారు.దానిని జగన్  ఆపాలని  చూస్తే దానికి నిరాహారదీక్ష చేస్తారా.ఇది సమంజసం కాదు. మా ముఖ్యమంత్రి  ఈఏడాది పరిపాలనలో ప్రతి నియోజకవర్గంలో కూడా దేవాలయాలు అభివృద్ది చేయాలని,ధీపధూప నైవేద్యాలలో భాగంగా అందరికి జీతాలు పెంచాలని ఆదేశాలు ఇచ్చారు.

Related Posts