YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

2, 24, 789.18 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

2, 24, 789.18 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

. 2, 24, 789.18 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
అమరావతి జూన్ 16,
ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు.2, 24, 789.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆయన తన బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించే నాయకుడు జగన్ అని ఆయన పేర్కొన్నారు.కాగా తన బడ్జెట్ లో రెవెన్యూ అంచనా వ్యయాన్ని 1, 59, 392.65 కోట్ల రూపాయలుగా చూపారు. మూల ధన వ్యయం అంచనాను 44, 396. 543 కోట్లుగా చూపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని చెప్పారు. కరోనాపై పోరాటంలో ముందున్నామని అన్నారు. బడ్జెట్ లో వ్యవసాయానికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కేటాయింపులు చేశారు. వ్యవసాయానికి 11, 981 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రైతు భరోసాకు 3, 651 కోట్లు, ధరల స్థిరీకరణకు రూ. 3వేల కోట్లు కేటాయించారు. డాక్టర్ వైఎస్సార్ పంటల బీమా పథకానికి రూ. 500 కోట్లు,  వడ్డీలేని రుణాల కోసం 11వందల కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే 2018-19లో స్ఫూల ఉత్పత్తి పెరుగుదల 8 శాతం మాత్రమేనని మంత్రి చెప్పారు. 
వివిధ పథకాలకు కేటాయింపుల వివరాలు:
వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ - రూ. 3,615.60 కోట్లు
104, 108 పథకాలకు - రూ. 470.29 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు - రూ. 2,277 కోట్లు
ప్రాథమిక, ఇంటర్ విద్యకు - రూ. 22,604 కోట్లు
ఆరోగ్య రంగానికి - 11,419.44 కోట్లు
హోం శాఖకు - రూ. 5,988.72 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి - రూ. 1,279.78 కోట్లు
ఐటీ రంగానికి - రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమ రంగానికి - రూ. 601.37 కోట్లు
జలవనరుల శాఖకు - రూ. 11,805.74 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి - రూ. 16,710.34 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి - రూ. 696.62 కోట్లు
సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపామని మంత్రి వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే, వారి కష్టాలు తీర్చడం కోసమే నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్తును ఎదుర్కొనే విషయంలో దేశంలోనే ఏపీ ముందుందని చెప్పారు. కరోనా సంక్షోభ  సమయంలోనూ సంక్షేమాన్ని విస్మరించలేదని మంత్రి  పేర్కొన్నారు.

Related Posts