YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

జేసీ కేసు విచారణ ముమ్మరం

జేసీ కేసు విచారణ ముమ్మరం

జేసీ కేసు విచారణ ముమ్మరం
అనంతపురం జూన్ 17 
అనంతపురం జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై పోలీసుల విచారణ లోతుగా చేపట్టారు. జేసీ ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ కేసుకు సంబంధించి అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు దాఖలు చేసిన రెండు పిటీ వారెంట్లకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా పిటీ వారెంట్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌లో తెలిపారు. ఈ మేరకు పిటీషన్‌పై వాదనలు విన్న కోర్టు జేసీ దివాకర్‌ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌ రెడ్డిని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. జేసీ ట్రావెల్స్‌ నకిలీ ఇన్‌ వాయిస్‌లతో 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించిన సంగతి తెలిసిందే. కాగా క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల కోసం ఎస్సై , సీఐ సంతకాలను జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీకి పాల్పడిందని కేసులు నమోదయని సంగతి తెలిసిందే

Related Posts