YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

పులివెందులలో  వ్యాక్సిన్ ఫ్యాక్టరీ

పులివెందులలో  వ్యాక్సిన్ ఫ్యాక్టరీ

పులివెందులలో  వ్యాక్సిన్ ఫ్యాక్టరీ
విజయవాడ, జూన్ 19,
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. పులివెందులలోని ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి  అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత పశువులకు అవసరమైన వ్యాక్సిన్‌ ఉత్పత్తి కేంద్రం లేకపోవడంతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ఏపీలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పీపీపీ విధానంలో ఐజీవైతో పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్రం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించనున్నారు.పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు పులివెందులలో తయారీ కానున్నాయి. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. దీంతో 100 నిపుణులకు, సిబ్బందికి ఉపాధి కలగనుంది. మన రాష్ట్రాలు అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది

Related Posts