YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'పోకిరి' ఫ్లాప్‌

'పోకిరి' ఫ్లాప్‌

దర్శకులు రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వర్మ దగ్గర శిష్యరికం చేసిన పూరీ.. ఇప్పటికీ తాను చేసిన సినిమాలను మొదట వర్మకు చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా తెరకెక్కిస్తున్న 'మెహబూబా' చిత్రంలోని కొన్ని సన్నివేశాలను వర్మకు చూపించారు. వాటిని చూసిన వర్మ తనదైన కామెంట్లను పెట్టారు. "'మెహబూబా'లోని కొన్ని సన్నివేశాలను చూశాను. ఈ సినిమాతో పోలిస్తే 'పోకిరి' ఫ్లాప్‌. తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో పూరీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీశాడు" అంటూ ప్రశంసలు కురిపించాడు. మరోవైపు దీనిపై స్పందించిన పూరీ జగన్నాథ్.. "మా బాస్ మొదటిసారి నన్ను చిత్ర దర్శకుడిగా గుర్తించాడు. నా జీవితంలో ఇదే పెద్ద ప్రశంస. లవ్ యు సర్" అంటూ కామెంట్ పెట్టాడు

Related Posts