YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 మొబైల్స్ షాప్ లో చోరీ

 మొబైల్స్ షాప్ లో చోరీ

 మొబైల్స్ షాప్ లో చోరీ
50 వేల నగదును ఎత్తుకెళ్లి దుండగులు
రంగారెడ్డి జూన్ 20,
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో మనీ ట్రాన్స్ఫర్ షాపులో  యాభై వేల 0 నగదును దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన శుక్రవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందిగామ మండల కేంద్రానికి చెందిన కుంచం శ్రీధర్ మనీ ట్రాన్స్ఫర్, మొబైల్స్ షాప్ లో శుక్రవారం రాత్రి ఆన్లైన్లో పంపించిన డబ్బులు కౌంటర్ లో పెట్టి తాళం వేసి ఇంటికి వెళ్ళాడు. శనివారం ఉదయం షాప్ తీసేసరికి పైన ఉన్న రేకులు పగలగొట్టి అందులో నుండి దొంగలు చొరబడి 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న సి ఐ రామయ్య ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామయ్య తెలిపారు..

Related Posts