YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

గరం గరంగా..బంగారం

గరం గరంగా..బంగారం

గరం గరంగా..బంగారం
ముంబై, జూన్ 22
పసడి జోరు కొనసాగుతోంది.బంగారం పరుగులు పెడుతోంది. మిలమిల మెరుస్తూ పైపైకి చేరింది. బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. దీంతో పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి ఎగసింది. రూ.50 వేల మార్క్‌ను దాటేసి ఇంకా పైపైకి కదులుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.520 పైకి కదిలింది. దీంతో ధర రూ.46,090కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.570 పెరుగుదలతో రూ.50,270కు చేరింది. ఇది బంగారానికి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.620 పెరిగింది. దీంతో ధర రూ.48,670కు పరుగులు పెట్టింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.60 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1763 డాలర్ల పైకి చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.81 శాతం పెరుగుదలతో 17.99 డాలర్లకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర ర్యాలీ చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.510 పైకి కదిలింది. దీంతో ధర రూ.46,760కు ఎగసింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.47,960కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.620 పెరిగింది. రూ.48,670కు ఎగసింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts