YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆదాయం పెంచుకొనే పనిలో మున్సిపాల్టీలు

ఆదాయం పెంచుకొనే పనిలో మున్సిపాల్టీలు

ఆదాయం పెంచుకొనే పనిలో మున్సిపాల్టీలు
నల్గొండ, జూన్ 23,
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల డెవలప్ మెంట్ కు సర్కార్ ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లే సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. వివిధ మార్గాల్లో నిధుల సేకరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఫండ్స్ సేకరణకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. భూముల రెగ్యులరైజేషన్పై ఇప్పటికే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించారు. గ్రేటర్హైదరాబాద్ మినహా రాష్ర్టంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 3,892 అక్రమ లే అవుట్లు… 2,81,171 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నింటినీ రెగ్యులరైజేషన్ చేస్తే భారీగా నిధులు సమకూరుతాయని మున్సిపల్ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన 41 మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ గడువును సెప్టెంబర్ వరకు పెంచింది.2018 మార్చి 30లోపు రిజిస్ట్రేషన్ చేయించిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించారు.జూన్30తో ఈ గడువు ముగియాల్సి ఉండగా, మున్సిపల్ శాఖ ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు రాకపోవడంతో ప్రభుత్వం గడువును మరోసారి పెంచింది.నేషనల్, స్టేట్‌‌ హైవేల వెంట ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములను భారీగా లే అవుట్లుగా, ప్లాట్లుగా మార్చారు. వీటి అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తయ్యాయి. అనంతరం ప్రభుత్వం రాష్ర్టంలో కొత్తగా 41 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీలలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు సైతం నిధులు లేవు. దీంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలుతో నిధులు సేకరించాలని నిర్ణయించింది. అయితే ఎక్కువ మంది ఎల్ఆర్ఎస్కు ఆసక్తి చూపడం లేదు. కొత్త మున్సిపాలిటీలు ఇటీవలి వరకు గ్రామాలే. అక్కడ భూముల రెగ్యులరైజేషన్ చేసుకున్నా, చేసుకోకున్నా ధరల్లో పెద్దగా తేడా ఉండదనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం లేదు. మరోవైపు రెగ్యులరైజ్ చేసిన ప్లాట్‌‌లో నిర్మాణాలు చేయకుంటే ‘వేకెంట్‌‌ ల్యాండ్‌‌ టాక్స్‌‌’ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగానూ ఎల్‌‌ఆర్‌‌ఎస్‌‌ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు.

Related Posts