YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం ఆంధ్ర ప్రదేశ్

జాతీయ స్థాయి కవయిత్రు లకు ఘన సన్మానం...

జాతీయ స్థాయి కవయిత్రు లకు ఘన సన్మానం...

జాతీయ స్థాయి కవయిత్రు లకు ఘన సన్మానం...
జగిత్యాల జూన్23
జాతీయ స్థాయి సాహిత్య పోటీలలో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింప జేసిన జగిత్యాల జిల్లాకు చెందిన కళాశ్రీ సాహితీ వేదిక కవయిత్రులు అభినందనియులని, సాహిత్యములో తెలుగు భాషను బ్రతికించేందుకు మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం అని జిల్లా అదనపు కలెక్టర్ బేతి రాజేశం అన్నారు.  ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ పితృ దినోత్సవ సందర్భంగా చిగురుమల్ల శ్రీనివాస్  సారథ్యంలో ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న అనే అంశంపై నిర్వహించబడిన  ప్రపంచ స్థాయి కవితల పోటీల్లో దాదాపు750 మందికి పైగా కవులు కవయిత్రులు పాల్గొనగ జగిత్యాల జిల్లా నుండి కళాశ్రీ సాహితీ వేదిక సభ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయినులు కవయిత్రులు   మద్దెల సరోజన,కటుకం కవిత,అయిత అనితలు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించినందుకుగాను ప్రశంసా పత్రాలను పొందడం జరిగింది. ఎల్లలు దాటి తమ ప్రతిభను చాటి జగిత్యాలజిల్లా ఖ్యాతిని వ్యాపింపజేసినందుకు అభినందిస్తూ  జగిత్యాల జిల్లా ఆడిషినల్ కలెక్టర్ బేతి రాజేశం చేతులమీదుగా ప్రశంస పత్రాలను వారి కార్యలయములో అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పాత్రికేయులు టి.వి. సూర్యం, జాగృతి జిల్లా కన్వీనర్  ఉజగిరి జమున, శ్రీ విశ్వ గాయత్రి పరివార్ ప్రతినిధి కొమురవెల్లి లక్ష్మీనారాయణ పలువురు సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

Related Posts