YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 హైద్రాబాద్ లో కొనసాగుతున్న బంగారం షాపుల బంద్

 హైద్రాబాద్ లో కొనసాగుతున్న బంగారం షాపుల బంద్

 హైద్రాబాద్ లో కొనసాగుతున్న బంగారం షాపుల బంద్
హైద్రాబాద్, జూన్ 27,
హైదరాబాద్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున నగరంలోని బంగారం దుకాణాల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి వచ్చే నెల 5 వరకూ పూర్తిగా లాక్ డౌన్ పాటించాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పాట్ మార్కెట్, జనరల్ బజార్‌లోని బంగారు దుకాణాలన్నీ శనివారం నుంచి మూత పడనున్నాయి. వచ్చే నెల 5 వరకూ వ్యాపారులు ఎవరూ దుకాణాలు తెరవబోరని జువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ శుక్రవారం వెల్లడించారు.హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అశోక్ జైన్ వెల్లడించారు. రద్దీ మార్కెట్లలో వేర్వేరు ప్రాంతాల నుంచి వినియోగదారులు, చిరు వ్యాపారులు వస్తుంటారని, వారిని అదుపు చేయడం చాలా కష్టమైన పని అని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ పదాదికారుల సమావేశం నిర్వహించి ఈ అంశంపై బాగా చర్చించామని వివరించారు. చివరికి దుకాణాలన్నింటినీ కొద్ది రోజులు మూసేయాలని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.కరోనా నుంచి రక్షణ పొందేందుకు అందరూ సహకరించాలని అశోక్ జైన్ సూచించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరి సంక్షేమం కోసమే కరోనా పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అశోక్ జైన్ అన్నారు.మరోవైపు, ఇదే సమస్యతో ఇప్పటికే చార్మినార్ చుట్టుపక్కల ఉన్న లాడ్ బజార్‌ను మూసేశారు. బేగంబజార్, కిషన్‌గంజ్, మహారాజ్‌గంజ్‌, బర్తన్‌ బజార్‌ తదితర మార్కెట్లను మూసేయాలని నిర్ణయించారు. ఇటు రాణిగంజ్ మార్కెట్‌లోనూ ఈ నెల 28 నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నట్లు స్థానికులు ప్రకటించారు. దీంతో 8 రోజుల పాటు రాణిగంజ్ హ‌బ్‌లోని 5 వేల షాపులు బంద్ కానున్నాయి.

Related Posts