YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

పసిడి పరుగులు...

పసిడి పరుగులు...

పసిడి పరుగులు...
ముంబై, జూన్ 29,
పసిడి మెరిసింది. బంగారం ధర పరుగులు పెట్టింది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని యోచించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.230 పైకి కదిలింది. దీంతో ధర రూ.46,410కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెరుగుదలతో రూ.50,620కు ఎగసింది. ఇది బంగారానికి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.410 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,110కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1786 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 18.07 డాలర్లకు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర ర్యాలీ చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.510 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,210కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ.510 పెరుగుదలతో రూ.48,410కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.410 పెరిగింది. రూ.48,110కు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts