YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర అస్వస్థత

సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర అస్వస్థత

సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ
ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర అస్వస్థత
పరవాడ జూన్ 30,
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన విషాదం నుంచి తేరుకోకముందే…విశాఖ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ కంపెనీలో విషవాయువు లీకై ఇద్దరి ఉసురు తీసింది. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు షిఫ్ట్ ఇన్చార్జ్ రావి నరేంద్ర(33)), కెమిస్ట్ గౌరీశంకర్(26).  చంద్రశేఖర్, ఆనందబాబు, జానకీరావు, సూర్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.బాధితులను చికిత్స నిమిత్తం గాజువాకలోని ఒక  ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రల్లో  ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పరిశీలించారు. పరిశ్రమ లోపలికి మీడియాను అనుమతించడంలేదు. కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

Related Posts