YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం

 తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం

 తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం
హైదరాబాద్ జూన్ 30 
తెరాస ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వం. మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాణ్యత లేని ప్రోజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సీఎం సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటె మిగితా చోట్ల ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో! స్కాముల కోసమే స్కీములు పెట్టారనడానికి కొండపోచమ్మ కాలువకు పడిన గండే సాక్ష్యం. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణమి అన్నారు. నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి, కఠిన చర్యలు చేపట్టాలి. కాంట్రాక్టర్ నుండి ఈ మొత్తాన్ని రికవర్ చేసి తక్షణమే మరమత్తు పనులు చేపట్టాలి. నాణ్యత లేని పనులు చేపడుతుంటే విజిలెన్సు డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఎం చేస్తున్నట్లని ప్రశ్నించారు. ప్రోజెక్టుల పేరు మీద నాణ్యత లేని పనులు చేపట్టి కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అయన అన్నారు

Related Posts