YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సినీ ఇండస్ట్రీలోకి భూమా ఫ్యామలీ

సినీ ఇండస్ట్రీలోకి భూమా ఫ్యామలీ

సినీ ఇండస్ట్రీలోకి భూమా ఫ్యామలీ
హైద్రాబాద్, 
భూమా నాగిరెడ్డి-శోభా దంపతుల రాజకీయ వారసురాలిగా ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ కీలకనేతగా ఉన్న సంగతి తెలిసిందే. 2014లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికై.. అనతరం టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రి పదవిని దక్కించుకుంది అఖిల ప్రియ. ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజమ్ శాఖా మంత్రిగా పనిచేసిన అఖిల ప్రియ.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.ఈ ఎన్నికల అనంతరం ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ హవా తగ్గడంతో పాటు.. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చడానికి అఖిల ప్రియ స్కెచ్ వేసిందనే వార్తలతో ఆమె హాట్ టాపిక్ అయ్యారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ టీడీపీ నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుండటంతో భూమా అఖిల ప్రియ రాజకీయాలను కొనసాగిస్తూనే సేఫ్ జోన్‌గా సినిమా రంగం వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భర్త భార్గవ్ నాయుడు తో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట అఖిల ప్రియ.తొలి నుంచి భూమా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండనే ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలని చూస్తున్నారట అఖిల ప్రియ. నిజానికి అఖిల ప్రియ 2019 ఎన్నికల తరువాతే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని భావించి ఆవైపుగా ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఈలోపు కరోనా ఎఫెక్ట్ తగలడంతో ప్రస్తుతానికి ఆమె ప్రయత్నానికి బ్రేక్ పడింది. చూడాలి మరి పొలిటికల్‌గా పెద్ద సక్సెస్‌ను చూడలేకపోయిన భూమా అఖిల ప్రియ సినిమా రంగంలో రాణిస్తారేమో.

Related Posts