YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేదం

అంతర్జాతీయ  విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేదం

న్యూఢిల్లీ జూలై 3  అంతర్జాతీయ  విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. జూలై  31 వరకు అంతర్జాతీయ  విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ‌(డీజీసీఏ)  ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో కొన్ని  ప్రయాణికుల విమాన సర్వీసులకు అనుమతించే అవకాశం ఉన్నదని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి  అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలను కేంద్రం నిలిపివేసింది.  రెండు నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ ప్రయాణికుల విమానాలకు కేంద్రం అనుమతినిచ్చింది.  విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related Posts