YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

పోర్టు్లో నిలిచిపోయిన చైనా ప్రోడక్ట్స్

పోర్టు్లో నిలిచిపోయిన చైనా ప్రోడక్ట్స్

న్యూఢిల్లీ, జూలై 4, 
భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలు ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా చైనాకు ఝలక్ ఇస్తూనే వస్తోంది. ఆ దేశం నుంచి భారత్‌లోకి వస్తున్న పలు దిగుమతులపై ఆంక్షలు విధించింది.టెలికం, రైల్వే, పవర్ సెక్టార్‌లకు సంబంధించి చాలా ప్రొడక్టులు ఇప్పుడు చైనా నుంచి మన దేశంలోకి దిగుమతి అవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో టెక్స్‌టైల్ రంగానికి చెందిన వస్త్రాలు, వీటి తయారీకి అవసరమైన మెషీన్లు, ఇతర ముడి సరుకులు చైనా నుంచి భారత్‌లోకి రావడం లేదు. దీంతో దేశంలో దుస్తుల ధరలు పెరిగే అవకాశముంది.భారత్ ప్రధానంగా ఫాస్టెనర్లు, బటన్లు, కుట్టు యంత్రాలు, పిన్స్ సహా ఇతర టెక్స్‌టైల్ మెటీరియల్స్ కోసం చైనాపై ఆధారపడి ఉంది. ఇప్పుడు చైనా నుంచి వచ్చిన టన్నుల కొద్ది గూడ్స్ మాత్రం పోర్ట్‌లో నిలిచిపోయాయి. టర్కీ, తైవాన్, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి వాటి నుంచి ఈ సరుకును తీసుకోవచ్చు. కానీ కీలకమైన యాక్సరిసీర్, మెషీన్ల విడిభాగాలు వంటివి కేవలం చైనాలోనే లభ్యమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారిన్ బ్రాండ్ల కోసం వస్తువులను తయారు చేసే ఎగుమతిదారులు ఆర్డర్లు ఆలస్యం కావొచ్చని తెలియజేస్తున్నాయి. అంటే డిమాండ‌కు తగినట్లుగా సరఫరా ఉండదు. దీంతో ధరలు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.మరోవైపు మన వస్త్ర రంగం చిన్న సూది దగ్గరి నుంచి ఫ్యాబ్రిక్ జిగురు వరకు ప్రతి దానికీ చైనాపై ఆధారపడుతూ వస్తోంది. వీటిని భారతదేశంలో కూడా తయారు చేయవచ్చు. కానీ దీనికి ప్రభుత్వ సాయం అవసరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

Related Posts