YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ కుట్ర : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ కుట్ర : కిషన్ రెడ్డి

బడ్జెట్ సమావేశాలు జరగకుండా పార్లమెంటు లో ప్రతిపక్షాలు చేసిన చర్యలకు ప్రధానమంత్రి మోడీ బాధపడి ఈ నిరాహార దీక్షకు పిలుపు ఇచ్చారు. ఇంతకు ముందు ప్రధాని ఒక కుటుంబం వెనకాల చేతులు కట్టుకొని వెనక నడిచేవాడు. ఇప్పుడున్న ప్రధాని మోదీ ముందు నడుస్తుంటే ప్రపంచ దేశాల నేతలు మోడీ వెనక నడిచే పరిస్థితి మోడీ తీసుకువచ్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం భారతీయ జెండా ఎగురుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు అన్నీ ఏకమవుతున్నాయి. కేంద్రంలో గాంధీ కుటుంబం,యూపీలో ములాయం కుటుంబం. ఇలా కుటుంబ పాలనను చరమగీతం పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం. కుటుంబ పాలనను కూలదోసి ప్రజాపాలనను తీసుకు వస్తున్న మోడీ, అమిత్ షా ద్వయాన్ని అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదం వైపు చూస్తున్న జమ్మూ కాశ్మీర్ యువతను అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నాలు మోడీ చేస్తున్నారని అన్నారు. అవినీతి రహిత పాలనను మోడీ అందిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో అన్నీ అవినీతి స్కామ్ లే. గత ప్రభుత్వ హాయంలోప్రభుత్వాలను మోసం చేసిన వ్యక్తులు దేశం విడిచి పారిపోయారు మోడీ భయానికి.ఇక్కడుంటే జైలుకు వెళ్లాల్సి వస్తున్నదని అన్నారు. దేహం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇండియాకు తిరిగివస్తాం అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇంతకుముందు స్కామ్ లు చేసిన వారు ఇండియాలోనే స్వేచ్ఛగా తిరిగారు. కానీ మోడీ ప్రభుత్వంలో నేరగాళ్లకు స్థానం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉగ్రవాదులు బాంబుల పేల్చేవారు. మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదానికి చర్మం గీతం పాడారు ఇండియాలో. ఇలా ప్రశాంత ప్రజా పాలనను అందిస్తున్న మోడీ ఉంటే ప్రతిపక్షాల ఆటలు సాగవు కనుక అన్ని అవినీతి రాజకీయ పార్టీలు మోడీకి వ్యతిరేఖంగా జట్టు కడుతున్నాయి.మోడీ ప్రభుత్వంలో 18వేల గ్రామాలకు విద్యుత్ వెలుగులు నింపారు. ఎల్ ఈ డీ బల్బులను దేశానికి పరిచయం చేసిన మోడీ. ఎవరెన్ని కుట్రలు చేసిన మళ్లీ మోడీ ప్రభత్వం రావడం ఖాయమన్నారు. .దేశాన్ని కులం ,మతం, ప్రాంతం,పేరిట విడగొట్టటానికి కాంగ్రెస్ పార్టీ ,మిగతా ప్రతిపక్షాలు ఒక కుట్ర చేస్తున్నాయి.దేశాన్ని అభివృద్ధి వైపు మోడీ నడిపిస్తున్నారు.ఇది నచ్చని అవినీతి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు.

Related Posts